ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టోల్ ప్లాజా తనిఖీల్లో భారీగా నగదు స్వాధీనం, పలువురు అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 31, 2024, 05:09 PM

నెల్లూరు జిల్లా కావలిలో భారీ మొత్తంలో నగదు, బంగారం పట్టుబడింది. ముసునూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఓ బస్సును తనిఖీ చేయగా.. కొందరు మహిళల వద్ద లెక్కలు చూపని రూ. 1,61,49,500 నగదు పట్టుబడింది. ఆ కాసేపటికే అటువైపు నుంచి మరో కారు రాగా.. వారిని తనిఖీ చేశారు. ఆ కారులో 1497.410 గ్రాముల బంగారం బిస్కెట్లు పట్టుబడ్డాయి. వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఐదుగురు మహిళలు తెలంగాణలోని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి చెన్నైకి వెళ్తున్నారు. నిందితులు తిప్పన సుమతి, ఎర్రడ్ల తేజశ్రీ, షేక్ పర్వీన్, దూరి యాదమ్మ, బంటు శిమ్మల నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరు చెన్నైలో బంగారం కొనేందుకు వెళ్తున్నట్లు పోలీసులకు తెలిపారు. అయితే, కారులోని నిందితులు చెన్నైలో బంగారం కొనుగోలు చేసి మిర్యాలగూడకు వెళ్తున్నారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడగా.. బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బిట్రా మోహన్ కుమార్, పగిళ్ల ప్రభాకర్‌గా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa