ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రౌడీషీటర్‌ లకి జిల్లా బహిష్కరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 31, 2024, 05:12 PM

ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కడప జిల్లాకు చెందిన పోలీస్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కడపలోని రౌడీషీటర్లను జిల్లా బహిష్కరణకు అధికారులు రంగం సిద్ధం చేశారు. జిల్లా నుంచి 21 మంది రౌడీ షీటర్లను బహిష్కరించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 1038 మందిపై పోలీసులు రౌడీషీట్ తెరిచారు. 652 మందిని పోలీసులు ముందస్తు అరెస్టు చేయనున్నారు. అలాగే131 మందిని గృహనిర్బంధం చేయనున్నారు. కడప, జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాల నుంచి మొత్తంగా 21 మందిని బహి ష్కరించనున్నారు. రేపు ఉదయం నుంచి జూన్ 7వ తేదీ వరకు జిల్లాలో ఉండ కూడదని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రౌడీషీటర్‌లు అందరికీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం నుంచి జిల్లా వదలాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో 600 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. 110 మందిని రౌడీషీటర్లను పోలీసులు గృహ నిర్బంధం చేయనున్నారు. అన్నమయ్య జిల్లాలో ఆరుగురు రౌడీషీటర్లను జిల్లా బహిష్కరణ చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa