ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో కొందరు అధికార పార్టీ నాయకులు విధ్వంసానికి దిగారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ధ్వంసం చేయడమే కాకుండా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై బుధవారం రాళ్లతో దాడి చేశారు. చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్లో నాడు–నేడు పథకం కింద అదనపు తరగతి గదులు నిర్మించారు. దానిని అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కూటమి గెలుపొందడంతో కొందరు అధికార పార్టీ నాయకులు బుధవారం రాత్రి పాఠశాలలోనికి వెళ్లి శిలాఫలకాన్ని పగలకొట్టారు. రణరంగచౌక్లో ఉన్న వైయస్ఆర్ విగ్రహంపై రాళ్లతో దాడి చేశారు. కొద్ది రోజుల క్రితం విగ్రహం సమీపంలో టైల్స్, రిటైనింగ్ వాల్స్ నిర్మించారు. దాదాపు 80 శాతం పని పూర్తయింది. మిగిలిన పని పూర్తి చేసేందుకు సదరు కాంట్రాక్టర్ సిద్ధమయ్యారు. ఇంతలో ఎన్నికల ఫలితాలు రావడం.. తెనాలి ఎమ్మెల్యేగా నాదెండ్ల మనోహర్ గెలవడం జరిగింది. దీంతో కొందరు టీడీపీ నాయకులు నిర్మాణ పనులు జరపడానికి వీలులేదని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులపై హుకుం జారీ చేశారు. దీంతో అధికారులు సదరు కాంట్రాక్టర్ను ఆ పనులు పూర్తి చేయొద్దని అడ్డుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa