డోన్ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని కోట్ల నివాసానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కోట్ల సూర్యప్ర కాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత మ్మలకు పూలబొకేలు అందజేసి శుభాకాం క్షలు తెలిపారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారన్నారు. మళ్లీ చంద్రబాబు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్న నమ్మకం తో ఎన్డీయే కూటమికి ప్రజలు భారీ విజయం అందించారన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరు స్తామన్నారు. టీడీపీ కూటమి విజయం కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో డోన్ మాజీ సర్పంచ్ టీఈ కేశవయ్యగౌడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ లక్ష్మిరెడ్డి, మాజీ ఎంపీపీ శేషఫణిగౌడు, ఓబులాపురం శేషిరెడ్డి, మర్రి రమణ, ఓంప్రకాష్, భాస్కర్ నాయుడు, రంజిత్ కిరణ్, బీజేపీ నాయకులు వడ్డె మహారాజ్, జనసేన నాయ కులు ఆలా మోహన్ రెడ్డి, పరదేశి మహేష్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa