రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ..... ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణమని, మిక్కిలి శోచనీయమని అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందేనన్నారు. ఇది పిరికిపందల చర్య తప్ప మరోటి కాదని షర్మిల అన్నారు. తెలుగువాళ్ళ గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విశేష ప్రజాదరణ పొందిన నాయకుడని, తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకమని షర్మిల వ్యాఖ్యానించారు. అటువంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదని.. గెలుపు ఓటములు ఆపాదించడం తగదన్నారు. వైఎస్సార్ను అవమానించేలా ఉన్న ఈ హీనమైన చర్యలకు.. బాధ్యులైన వారిని వెంటనే పట్టుకుని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని షర్మిలా పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa