ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజాశ్రేయస్సు కోసమే కూటమి ఏర్పడింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 15, 2024, 06:53 PM

ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ఐదు సంవత్సరాల పరిపాలన సాగుతుందనడానికి నిదర్శనం సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజలందరికీ మేలు చేకూరే విధంగా ఐదు హామీలపై సంతకాలు చేయడంపై జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం జగ్గంపేట టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టారన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు, పింఛన్ల పెంపు, అన్నక్యాంటీన్‌ పునరుద్దరణ, వృత్తినైపుణ్య శిక్షణ పథకంపై సంతకాలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. తనకు మంత్రిపై ఆలోచన లేదని నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక హామీలు నెరవేర్చడానికి సీఎంతో మాట్లాడి నిధులు తెచ్చుకోవడానికి అవకాశం కలిగిందన్నారు. నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలపై అవినీతి జరిగిందని దీనిపై ప్రత్యేక కమిటీ వేసి అర్హులకు న్యాయం చేస్తామని నెహ్రూ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్వీ ఎస్‌ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, పాటంశెట్టి రవి, అన్నవరం రాము, గల్లా రామచంద్రరావు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa