ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును జల వనరుల శాఖ మంత్రిగా నియమించారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రాధా న్యత కలిగిన శాఖ నిమ్మలకు దక్కడంతో.. ఇక ఈ రంగం లో పనులు వేగవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కార్యదక్షత కలిగిన నిమ్మలకు జలవనరుల శాఖ కేటాయించడంతో అందరి లోనూ ఆశలు రేకెత్తాయి. పోలవరం ప్రాజెక్ట్ కొలిక్కి రానుంది. కేంద్ర సహకారం అందనుంది. ఉభయ గోదావరి జిల్లాలకు రబీ స్థిరీకరణ కావాలంటే ఈ ప్రాజెక్ట్ ఒక్కటే మార్గం. నిమ్మలకు జలవనరుల శాఖ కేటాయించడంతో ఇది పరుగులు తీస్తుందన్న నమ్మకం ఏర్పడింది. పనులు నిర్వహించడంలో నిత్యం అధికారులు వెంటపడడం నిమ్మ ల నైజం. పని అయ్యేంత వరకు అదే ధ్యాసతో ఉంటారు. వార్తల్లోనూ నిలుస్తుంటారు. పాలకొల్లుకు శ్మశాన వాటిక నిర్మాణానికి కాంట్రాక్టరు రాకపోవడంతో అక్కడే మూడు రోజులు నిద్రించారు. అపోహలను తొలగించారు. శ్మశాన వాటిక నిర్మించేలా చర్యలు తీసుకున్నారు. ఇలా పని విష యంలో పట్టుదలతో ఉంటారు. అందుకే జలవనరుల శాఖను చంద్రబాబు ఏరికోరి నిమ్మలకు కేటాయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa