హౌసింగ్ కార్యక్రమంపై నిన్న (మంగళవారం) సమీక్షించానని, గత ప్రభుత్వం గృహ నిర్మాణంలో పేదవారికి అన్యాయం చేసిందని మంత్రి కొలుసు పార్థ సారథి విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయంలో 2 లక్షలు నుంచి 2.50 వేలు వుంటే వాటిని వైసీపీ ప్రభుత్వం 1.80 వేలకు తగ్గించారని ఆరోపించారు. ఈ సందర్భంగా బుధవారం మంత్రి అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. 2014-19 మధ్యలో 4.43 లక్షలు ఇళ్లను పూర్తి చేయకుండా ఉంచేశారని, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం పూర్తి చేయాల్సిన పెండింగ్ ఇళ్లను తాము పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
![]() |
![]() |