ఓడిపోయామన్న భావనను మనసులోనుంచి తీసేయండి.. మనం ఓడిపోలేదు.. అన్న విషయాన్ని గుర్తించాలని వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. న్యాయంగా, ధర్మంగా మనం ఓడిపోలేదు. ప్రతీ ఇంట్లో కూడా మనం చేసిన మంచి ఉంది. ప్రతీ ఇంటికీ కూడా మనం తలెత్తుకుని పోగలమన్నారు. రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి, ప్రతీ గడపకు మనం చేసిన మంచి ఏమిటో తెలుసు. ఈరోజుకీ వైయస్ జగన్ అంటే అబద్దాలు చెప్పుడు.. మోసం చేయడు అని వారికి తెలుసు. వైయస్ఆర్సీపీ అందించిన పాలనను ప్రజలు మరిచిపోరు. ఇదే ప్రజలు 2029 నాటికి చంద్రబాబు మోసాలు, ప్రలోభాలను గుర్తించి రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ వైయస్ఆర్సీపీని అధికారంలోకి తెచ్చుకుంటారు అని వైసీపీ నేతలతో జరిగిన సమావేశంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa