కదిరి పట్టణం అడపాల వీధిలో తాళం వేసిన ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు 8 తులాల బంగారు ఆభరణాలు అపహరించుకెళ్లారు. బాధితుడు పోలీసులకు తెలిపిన వివరాలు. కుళ్లాయప్ప ఈనెల 18న వ్యవసాయ పనుల నిమిత్తం స్వగ్రామమైన నల్లమాడ మండలం మసకవంకపల్లికి వెళ్లారు. శుక్రవారం ఆయన తిరిగి కదిరికి వచ్చారు. బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటం చూసి అందులోని 8 తులాల బంగారు నగలు చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa