నంద్యాల జిల్లాలో చిరుత సంచారం కలకలంరేపుతోంది. నల్లమల అటవీ ప్రాంతంలో కట్టెల కోసం వెళ్లిన ఓ మహిళపై చిరుత దాడిచేసి చంపేసింది. శిరివెళ్ల, మహానంది మండలాల సరిహద్దులో ఉన్న పచ్చర్లకు చెందిన మాజీ ఉప సర్పంచి షేక్ మెహరూన్బీ.. మంగళవారం ఇంట్లో కట్టెల కోసం నల్లమల అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. ఆమె ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఆమె కోసం గాలించగా.. కొద్ది దూరంలోనే మృతదేహం కనిపించింది.
ఆ చిరుత మెహరూన్బీ ఛాతీ, తల, కడుపు భాగంలో దాడి చేసింది.. మెహరూన్బీ తలను అటవీప్రాంతంలోకి లాక్కెళ్లిపోయింది. మెను గాలిస్తూ వెళ్లినవారు ఆమె మొండెంను గుర్తించారు. కొంతకాలంగా ఆ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో రైల్వేకు సంబంధించిన పనులు చేస్తున్న మహిళపై దాడికి తెగబడింది. మూడు రోజుల క్రితం షేక్ బేబీ అనే మహిళ ఇంటి దగ్గర నిద్రిస్తుండగా.. చిరుత అటువైపుగా వచ్చి ఆమెపై దాడి చేయడంతో గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు చిరుత కోసం గాలింపు మొదలుపెట్టారు.. అటవీ ప్రాంతంలో బోనులు ఏర్పాటు చేశారు.
మహానంది ప్రాంతం కావడంతో అక్కడికి వచ్చే భక్తుల్ని కూడా పోలీసులు, అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆలయానికి వచ్చేవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అటవీప్రాంతం వైపు వెళ్లొద్దని.. అప్రమత్తంగా ఉండాలంటున్నారు. భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచనలు చేస్తున్నారు. అలాగే అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉండే గ్రామాల ప్రజలు అలర్ట్గా ఉండాలని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa