మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ.. జగన్ లాంటి విపరీత, విధ్వంసకర ఆలోచనలు ఉండే వ్యక్తులు సీఎం పదవికి అనర్హులని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను నగరం నుంచి 20 కి.మీ.ల దూరానికి తరలించి, అక్కడ రాజధాని కడదామని చెప్పినప్పుడు తాను దిగ్భ్రాంతికి గురయ్యానని వెల్లడించారు. ఏ అంశంపై లోతుగా చర్చించడం జగన్కు ఇష్టం ఉండదని, ఏం చెప్పాలనుకున్నా రెండే నిమిషాల్లో ముగించేయాల్సిందేనని ఎల్వీఎస్ తెలిపారు. ఏదైనా అంశం గురించి అర్దమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నిస్తే.. అసహం వ్యక్తం చేసేవారని ఆరోపించారు. అంతేకాదు, దురుద్దేశాలను ఆపాదిస్తారని మాజీ సీఎం పేర్కొన్నారు.
స్టీల్ ప్లాంట్ వల్ల కాలుష్యం పెరిగిపోతుందని, దాన్ని నగరానికి దూరంగా తరలించి, ఆ భూముల్లో రాజధాని కడతానని ఒక సందర్భంలో తనతో అన్నారని చెప్పారు. ఉక్కు పరిశ్రమ వల్ల పొలుష్యన్ ఉండదని చెబితే.. నీకేమీ తెలియదని ఎద్దేవా చేశారన్నారు. అంతేకాదు, ప్రజావేదిక కూల్చివేతకు ముందు జరిగిన సంఘటనను వెల్లడించారు. ప్రజావేదిక కూల్చివేయాలని నిర్ణయించినట్టు సీఎం నుంచి ధనుంజయరెడ్డి ఫోన్ చేసి చెప్పి.. గోప్యంగా ఉంచమన్నారని, తర్వాత సీఎం ప్రకటిస్తారని చెప్పారని వివరించారు. ప్రజావేదికను చూసిన తర్వాతైనా జగన్ మనసు మార్చుకుంటారని భావించానని, కానీ, కూల్చివేతకే మొగ్గుచూపారని అన్నారు.
అలాగే, రాజధాని విషయంలోనూ తన అభిప్రాయం అడిగినప్పుడు.. అమరావతినే నోటిఫై చేశారు కదా? అని చెప్పాను కానీ.. నీకు తెలియదన్నా... అమరావతిలో చంద్రబాబుకు చాలా భూములున్నాయని జగన్ అనడంతో విస్మయానికి గురయ్యాయని అన్నారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి నిరాధారమైన ఏకపక్ష ఆరోపణలు చేసినప్పుడు మనం ఏం సమాధానం చెబుతామని ఎల్వీ సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఇదే విషయమై సీఆర్డీఏ అధికారులను అడిగితే.. చంద్రబాబు నాయుడికి అమరావతిలో ఎటువంటి భూములు లేవని చెప్పారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa