ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుధవారం జగన్ కేసుల పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. జగన్ కేసులకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 23కి వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా జగన్ న్యాయవాదికి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసుల విచారణను వేగవంతం చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మాజీ ఎంపీ హరీరామజోగయ్య ఈ పిటిషన్ను వేశారు. ఈ పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది.
![]() |
![]() |