భారీ వర్షాలు, వరదల వల్ల జిల్లాలో 4870 హెక్టార్లలో వివిధ పంటలు నీట మునిగాయి. 200 హెక్టార్లలో వరి నారుమడు, 4522 హెక్టార్లలో నాట్లు ముంపులోనే ఉన్నాయి. 148 హెకార్లలో పత్తి పంట నీట మునిగింది. కొద్ది రోజులు వరి నాట్లు నీటి ముంపులో ఉంటే తిరిగి నాట్లు వేయాల్సిందేనని, నారు కుళ్ళిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో భారీ వర్షాలు, ఎర్రకాలువ వరద కారణంగా వరి, పత్తి పంటలు నీటమునగడం, కూరగాయల పంటలు, అరటి పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతుల ఆవేదన వర్ణనాతీతం. ఏలూరు జిల్లాలో సార్వా వరి సాగు చేసిన ప్రాంతాల్లో ఎక్కువగా చింతలపూడి, బుట్టాయిగూడెం, దెందులూరు, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, నిడమర్రు, పోలవరం, కామవరపుకోట మండలాల్లో నారు నీట మునిగాయని జిల్లా వ్యవసాయ శాఖ నివేదికలు చెబుతున్నాయి. ఉంగుటూరు, జంగారెడ్డిగూ డెం, పోలవరం, నిడమర్రు, చింతలపూడి, ద్వారకాతిరుమల, కొయ్యలగూడెం, కామవరపుకోట, దెందులూరు, భీమడోలు, మండలాల్లో వరి నాట్లు అత్యధికం గా నీటి ముంపునకు గురయ్యాయి. 161 గ్రామాలులో పంటలు నీట మున గగా 3696 మంది రైతులు పంటను నష్టపోయే పరిస్ధితులు ఏర్పడ్డాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa