ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోదండ రామస్వామికి వైభవంగా గిరి ప్రదక్షిణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 22, 2024, 10:10 PM

ఆంధ్ర అయోధ్యగా పేరు గాంచిన ఒంటిమిట్టలో గురు పౌర్ణమి సందర్భంగా కోదండ రామస్వామి భక్తులు 14 కిలోమీటర్ల మేర గిరి ప్రద క్షిణ చేశారు. సీఐ పురుషో త్తంరాజు ఆధ్వర్యంలోబీజేపీ నాయకుడు పాటూరు గంగి రెడ్డితో కలిసి ఉదయం ఆరు గంటలకు కోదండ రామాలయం నుంచి పెద్ద కొత ్తపల్లె, గంగపేరూరు, పెన్నపేరూరు, ఇబ్రహీంపేట, రాచగూడపల్లె, రాచపల్లి, సాలాబాద్‌, మలకాటిపల్లె మీదుగా గిరి ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా సీఐ పురుషోత్తంరాజు మాట్లాడుతూ కోదండ రాముని ప్రాబల్యం మండల ప్రజలకు, జిల్లా ప్రజలకు తెలియాలని ప్రతి పౌర్ణమికి 14 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేస్తారన్నారు. తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి స్వామివారి ఆశీస్సులతో తాను ముందుకు వెళుతున్నానని, అడ్డ సంకల్పంతో స్వామివారికి సేవ చేయాలని వినూత్న కార్యక్రమాన్ని చేపట్టానన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాటూరు గంగిరెడ్డి, బాలరాజు, శివరాజు, ప్రతాప్‌రెడ్డి, ఎస్వీ సుబ్బారెడ్డి, బలరాం, పలువురు భక్తులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa