ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వంద రోజుల్లో ఆ వ్యవస్థలన్నీ గాడిలో పెడతా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 22, 2024, 10:11 PM

జిల్లావాసులు ఉపాధి కోసం అధికంగా వలసలు పోతున్నారు. గత ప్రభుత్వం ఉపాధి కల్పించేందుకు కనీసం పట్టించుకోలేదు అని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన మాట్లాడుతూ.... వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారు. చాలా ప్రభుత్వ శాఖలకు తాళాలు వేసేశారు. వంద రోజుల్లో ఆ వ్యవస్థలన్నీ గాడిలో పెడతా. జిల్లాలో అపారమైన మత్స్య సంపద ఉన్నా.. మత్స్యకారులు వేట కోసం గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాలకు పోతున్నారు. మత్స్యకారులకు ఉపయోగపడే జెట్టీలు, హార్బర్‌లు, కోల్డ్‌స్టోరేజీల నిర్మాణానికి ప్రణాళికలు చేపట్టాం. ప్రతిసమస్యపై అధ్యయనం చేసి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa