మదనపల్లె డిప్యూటీ కలెక్టర్ రమాదేవి సోమవారం సాయంత్రం రామసముద్రం తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగి పలు ఫైళ్లు అగ్నికి ఆహుతి అయిన నేపథ్యంలో డిప్యూటీ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరిం చుకుంది. ఈ తనిఖీలో 2022 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మండలం నుంచి మదనపల్లె ఆర్డీవో కార్యాలయానికి పంపిన పలు ఫైళ్లను తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఆర్టీఏ, అసైనమెంట్, 22ఎ, కోర్టు కేసులు, ఇంటి స్థలాలు, లోకాయుక్త, వెబ్ల్యాండ్స్, మ్యుటేషన తదితర 25ఫైల్స్కు సంబంధించి తనిఖీ లు చేసినట్లు సమాచారం. ఈ తనిఖీలలో తహసీల్దార్ శ్రీనివాసు లు, డీటీ శ్రీనివాస్రావు, పలువురు వీఆర్వోలు, వీఆర్ఏలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa