ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరాన్ని కేంద్రం పూర్తి చేస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 08:39 PM

ఏపీకి అనేక అంశాల్లో కేంద్ర బడ్జెట్‌లో సపోర్ట్ దొరికింది ఆనందంగా ఉందని టీడీపీ ఎంపీ భరత్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహాయంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. అమరావతి, క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో ఎప్పుడు కూడా గత వైసీపీ ఇన్ని నిధులు తెచ్చుకోలేదన్నారు. హైదరాబాద్, బెంగుళూరు, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ నోబ్‌కు సపోర్ట్ చేస్తామని చెప్పారన్నారు. వైసీపీ గత ఐదేళ్లుగా అమరావతిని చంపాలని అనుకుందని.. చివరికి అది సాధ్యం కాలేదని ఎంపీ వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామన్నారు. పోలవరం ఏపీ ప్రజల జీవనాడి అని.. దానిని పూర్తి చేస్తామని కేంద్రం చెప్పిందన్నారు. రాష్ట్రానికి అండగా నిలిచిన ప్రధాన నరేంద్ర మోదీకి ఎంపీ భరత్ కేబినెట్‌కి ధన్యవాదాలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa