ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పల్నాడులో ర్యాగింగ్ కలకలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 06:48 PM

పల్నాడు జిల్లా నరసరావుపేట ఎస్ఎస్ఎన్‌ కళాశాల వసతి గృహంలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎన్‌సీసీ ట్రైనింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులను సీనియర్లు అర్థరాత్రి సమయంలో విచక్షణ రహితంగా చితకబాదారు. వద్దని వారించినా వినకుండా కొడుతూనే ఉన్నారు. పదే పదే ఇలా చేస్తుండటంతో.. దెబ్బలు తట్టుకోక జూనియర్ విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈఘటన వైరల్ అవుతోంది. ర్యాగింగ్ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో నరసరావుపేట పోలీసులు కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థులను విచారిస్తున్నారు. నరసరావుపేట వన్ టౌన్ సీఐ కృష్ణారెడ్డి విద్యార్థులను విచారించి జరిగిన సంఘటన గురించి తెలుసుకున్నారు. వాస్తవానికి ఈ ర్యాగింగ్ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయండతో ఘటన వైరల్ అయింది. ర్యాగింగ్‌ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని.. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa