ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ కి రెడ్ బుక్ అంటే భయమేస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 06:49 PM

ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధంతంతో వస్తాయి కానీ ఏపీలో ఫేక్ రాజకీయం ఫేక్ ప్రచారం మాత్రమే వైసీపీ సిద్ధాంతం అని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యలు చేశారు. ఇంకా వైసీపీ అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైనాట్ 175 అని 11 సీట్లు కూడా తెచ్చుకోలేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి ఎగ్గొట్టాలనే ధర్నాలు చేస్తున్నారన్నారు. గతంలో ప్రతిపక్షాలను నోటి కొచ్చినట్లు మాట్లాడారని గుర్తుచేశారు. ఢిల్లీ వెళ్ళి తుగ్లక్ రెడ్డి ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. జగన్‌కు రెడ్ బుక్ అంటే భయపడుతున్నారని... ఢిల్లీ వెళ్ళి అక్కడ కూడా రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారని హోంమంత్రి అన్నారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష సభ్యుడుగా హుందాగా వ్యవహరించాలని హితవుపలికారు. రూ.15 వేల కోట్లు ఏపీకి ఇచ్చినందుకు ఢిల్లీ వెళ్లిన జగన్ మోదీకి ధన్యవాదాలు చెప్పాలన్నారు. జగన్ ఢిల్లీలో ఫొటో ఎగ్జిబిషన్ పెట్టారని..అందులో వైసీపీ హయాంలో జరిగినవి ఉన్నాయేమో చూసుకోవాలన్నారు. గతంలో అనంతబాబు హత్య చేసి డోర్ డెలవరీ చేస్తే అసెంబ్లీలో సేవ్ డెమోక్రసీ అని ప్లకార్డులు పట్టుకోవడం సిగ్గుచేటన్నారు. వైసీపీ హయాంలో జరిగిన ఘటనలు ఢిల్లీలో ఫొటో ఎగ్జిబిషన్ పెట్టాలి కదా జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa