ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ ధ‌ర్నాకు మ‌ద్ద‌తు తెలిపిన ఐయూఎంఎల్ ప్ర‌తినిధులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 06:51 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో ప్ర‌భుత్వ‌ ఉగ్ర‌వాదానికి వ్యతిరేకంగా వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్ చేస్తున్న పోరాటానికి ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్‌) అండగా నిలుస్తుందని, ధ‌ర్నాకు త‌మ సంపూర్ణ మ‌ద్ద‌తు తెలియ‌జేస్తున్నామ‌ని ఐయూఎంఎల్ ప్ర‌తినిధులు అబ్దుల్‌ వాహబ్, హ్యారిస్ అన్నారు. ఢిల్లీలో వైయస్ఆర్ సీపీ నిరసన కార్యక్రమంలో పాల్గొని, ఫొటో గ్యాలరీని సందర్శించారు. ఈ సందర్భంగా అబ్దుల్‌ వాహబ్, హ్యారిస్‌ ఏం మాట్లాడారంటే.. ``ఉగ్రవాదం అనేది పలు రకాలు. ప్రభుత్వం స్వయంగా చేసేది. అదే ప్రభుత్వ ఉగ్రవాదం. మరొకటి విప్లవ, సంఘవిద్రోహు ఉగ్రవాదుల ఉగ్రవాదం. మా ఐయూఎంఎల్‌ ఏ ఉగ్రవాదానికి అయినా వ్యతిరేకి. ప్రజాస్వామ్య వ్యవస్థలో మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటుంది. వైయ‌స్‌ జగన్‌ సీఎం అయ్యారు. ఆయనను తొలిసారిగా 2004లో చూసినప్పుడు, ఆయన భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారని అస్సలు ఊహించలేదు. అదే వైయస్ఆర్ కుమారుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఈరోజు ఆయన ప్రతిపక్షంలో ఉండొచ్చు. కానీ ఎవరికి తెలుసు. రేపు ఆయన ఏకంగా ప్రధాని కావొచ్చు. ప్రభుత్వ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వైయ‌స్ జ‌గ‌న్‌ పోరాడుతున్నారు. వైయ‌స్ జగన్‌కి మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. వైయ‌స్ జగన్‌గారికి, ఆయన పార్టీకి మా పూర్తి మద్దతు ఉంటుంది. ఈ పోరాటంలో మేము వారికి అండగా ఉంటాం`` అని ఈ సందర్భంగా అబ్దుల్‌ వాహబ్, హ్యారిస్ ప్ర‌క‌టించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa