ఈ విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ కోసం ఈ నెల 31న అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్ చేపడుతున్నట్లు నంద్యాల , నూనెపల్లి ప్రాంతంలోని ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. పాలిటెక్నిక్ నందు వివిధ డిప్లొమా కోర్సులలో 30 సీట్లు ఖాళీగా ఉన్నాయని, అలాగే అదనంగా ఈడబ్ల్యూఎస్ కింద 18 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ దరఖాస్తు ఫారంలను ఈ నెల 29న ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సమర్పించి 31న జరిగే కౌన్సెలింగ్కు హాజరు కావాలని సూచించారు. విద్యార్థులు మరిన్ని వివరాలకు 9912377723,9440021417 నెంబర్లలో సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa