కేతిరెడ్డి ఏదైనా మాట్లాడాలంటే పక్కా ఎవిడెన్స్ ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో ఉండే అభిప్రాయం. ఇలా ఒక భిన్నమైన దారిలో వెళ్తున్న కేతిరెడ్డిని ఈసారి ఓటమి మాత్రం చాలా కుంగతీసిందట.గతంలో ఓడిపోయినప్పుడు కేతిరెడ్డి పెద్దగా బాధపడలేదట. కానీ ఈసారి మాత్రం ఎప్పుడూ జనంతో ఉంటూ.... ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే.... ఇలాంటి తీర్పు జనాలు ఇచ్చారా అని కేతిరెడ్డి విపరీతంగా బాధపడుతున్నారట. అందుకు తగ్గట్టుగానే కేతిరెడ్డి వేశంలో ఇంకా చాలా మార్పు వచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు.
ఎప్పుడు కలర్ఫుల్ గా కనిపించే కేతిరెడ్డి ఇప్పుడు గడ్డం పెంచుకొని చాలా డీ గ్లామర్ గా కనిపిస్తున్నారని టాక్. ఇక గతంలో ఎలాంటి విషయమైనా కేతిరెడ్డి చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడే కేతిరెడ్డి ఇప్పుడు ఒక రకమైన స్వరంతో మాట్లాడుతున్నారట. అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వాటి మీద విచారణ జరిపించాలని డిమాండ్స్ విపరీతంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నిడిమామిడి భూముల విషయంలో ముఖ్యంగా కేతిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు అధికారపక్ష నేతలు.
వాస్తవంగా ఈ భూములు కేతిరెడ్డి పేరు మీద లేవు. అయితే ఆంజనేయ స్వామి మఠానికి సంబంధించిన భూములను వైసీపీ నేతలు కాజేసారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దాని వెనుక కేతిరెడ్డి ఉన్నారని ప్రత్యక్షంగా చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. అలాగే కేతిరెడ్డి ఐదేళ్లలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని.... వాటన్నింటి మీద విచారణ జరిపించాలని కేతిరెడ్డి ప్రత్యర్ధుల నుంచి వస్తున్న డిమాండ్. అయితే మిగతా ఆరోపణల సంగతి ఎలా ఉన్నప్పటికీ... నిడిమామిడి మఠం భూముల విషయంలో మాత్రం కేతిరెడ్డి కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ భూములకు, తనకు ఎలాంటి సంబంధం లేదని... సమగ్ర విచారణ జరపాలంటూ రివర్స్ ఎటాక్ కేతిరెడ్డి మొదలు పెట్టారని తెలిసింది. అంతేకాకుండా ఇప్పుడున్న పాలక పక్షం మాటలకే పరిమితమమైతే తిరిగి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్థానంలో పట్టాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని అంటున్నారట కేతిరెడ్డి. మొత్తంగా మారిపోయిన కేతిరెడ్డి తీరుపై నియోజకవర్గంలో గట్టిగా చర్చ జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa