ఏపీలో కూటమి ప్రభుత్వంలో హింస రోజురోజుకు పెరుగుతోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగా పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందన్నారు. అలాగే, పోలీసుల ముందే దారుణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు ఎవరో తెలిసిప్పటికీ వారి పేర్లను బయటకు చెప్పడం లేదన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని సోమవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడూ ఇటువంటి ఘటనలు జరగలేదు. ఏపీలో రాజకీయ ప్రేరేపిత దాడులు జరుగుతున్నాయి. ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ప్రభుత్వ ప్రేరేపిత హింసలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. పోలీసుల కళ్ల ముందే దారుణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో కుట్రలతో వైయస్ఆర్సీపీ కార్యకర్తలను చంపుతున్నా పట్టించుకోవడం లేదు. కనీసం ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయడం లేదు. ప్రాణహాని ఉందని చెప్పినా ఏ మాత్రం స్పందించడం లేదు. నంద్యాలలో టీడీపీ నేతలు మారణాయుధాలతో రోడ్లపై తిరుగుతున్నారు. ఏపీలో విచిత్రమైన పోలీస్ వ్యవస్థ ఉంది. రాజకీయ హత్యలను దుండగులు చంపేశారని ప్రచారం చేస్తున్నారు. సీతారామపురంలో అమాయకుడిని దారుణంగా హత్య చేశారు. సుబ్బారాయుడు అనే వ్యక్తిని చంపేసినా పట్టించుకోలేదు. తనకు ప్రాణహాని ఉందని నారప్ప రెడ్డి చెప్పినా పోలీసులు స్పందించలేదు. మా కార్యకర్తలను చంపుతుంటే ఈనాడు కూడా వార్తలు రాయడం లేదు. నిందితులు ఎవరో తెలిసిప్పటికీ వారి పేర్లను బయటకు చెప్పడం లేదు. ఇలాంటి ప్రభుత్వ ప్రేరేపిత హింస ఏ రాష్ట్రంలోనైనా ఉందా?. నడిరోడ్లపై హత్యలు, దాడులు చేస్తుంటే పోలీసులు కనీసం గాల్లోకి కూడా కాల్పులు జరపలేదు. కళ్ల ముందే మనిషిని చంపుతుంటే పోలీసులు ఆపలేరా? అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa