వచ్చే నెల 8వ తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ఈ రోజు జరిగిన బిజెనెస్ అడ్వజరీ కమిటీ నిర్ణయించింది. స్పీకర్ అధ్యక్షతన బుధావారం ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశం జరిగింది. శాసనసభ ఓటాన్ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి 8 వరకూ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అలాగే ఫిబ్రవరి 5వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 2 నుంచి 4వ తేదీ వరకూ అసెంబ్లీకి సెలవులు ప్రకటించారు. 1వ తేదీన విభజన సభ్యలు, ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో చర్చించాలని, ఫిబ్రవరి 6న గవర్నర్ ప్రసంగానికి ధన్యావాలపపై చర్చ చేయాలని, 7వ తేదీన సంక్షేమం, ఇతర శాఖలపై చర్చ, 8వ తేదీన విజన్ డాక్యుమెంట్ పై చర్చించాలని బీఏసీ సమావేశంలో నిర్నయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa