భవతి భిక్షాం దేహి అంటే శత్రువుకు కూడా అన్నం పెట్టే నేల, పాహిమాం, రక్షమాం అంటే ఎదుటి వాడి ప్రాణాలకు తన ప్రాణం అడ్డుపెట్టే నేల, సరిహద్దుల్లో పరాయి దేశాలపై దాడులు చేయని నేల... అలాంటి నేలపై ముష్కరులు, బ్రిటీష్ వారు దండయాత్ర చేసి సొమ్ము కొల్లగొట్టిన, పాలకులు నియంతృత్వ ధోరణితో అస్తవ్యస్తం చేసి, ప్రభుత్వ ఖజానా, ఆస్తులను దోపిడీ చేసినా కాలానుగుణంగా వారికి గుణపాఠాలు నేర్పింది ఈ నేల. అలాంటి ధైర్య సాహసాలు కలిగిన నా దేశ ప్రజలందరికి 78 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.గ్రామాల్లో దేశ భక్తి పెంపొందించేలా, గ్రామ పంచాయితీలను బలోపేతం చేసేలా, గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చేలా 34 ఏళ్ల తరవాత స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకలకు గతంలో చెల్లిస్తున్న 100, 200 రూపాయల నిధుల స్థానంలో మైనర్ గ్రామ పంచాయితీలకు 10 వేలు, మేజర్ గ్రామ పంచాయితీలకు 25 వేలు అందించడం జరిగింది.అపర అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారి పేరు మీద విద్యార్థుల ఆకలి తీర్చేందుకు NDA రాష్ట్ర ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా జిల్లాలో 1,253 పాఠశాలల్లో 1,02,591 మంది విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తుంది .ఆడబిడ్డల రక్షణ కోసం ప్రభుత్వం బలంగా పనిచేస్తుంది. ఆడబిడ్డలపై దాడులు చేసినా, వేదించినా, అఘాయిత్యాలకు పాల్పడినా సరే కఠినమైన చర్యలు ఉంటాయి. సోషల్ మీడియాలో మహిళల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించండి -సూపర్ సిక్స్, షణ్ముఖ వ్యూహం అమలుతో రాష్ట్రం ముందుకు వెళుతుంది. దేశంలోనే ఆదర్శనీయమైన రీతిలో దివ్యాంగులు, వితంతువులు, వృద్దులకు ఏ ఆసరా లేని 28 కేటగిరీలకు చెందిన ప్రజలకు స్వాలంబనగా నిలుస్తూ పెన్షన్లు గణనీయంగా పెంచింది, ఒక్క కాకినాడ జిల్లాలో 2,77,594 మంది లబ్ధిదారులకు 134 కోట్ల పెన్షన్లు అందిస్తుంది ప్రభుత్వం. పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. 2014 నుండి 2019 మధ్య కాలంలో జిల్లాలో ఇళ్లు నిర్మించుకున్న వారికి 49 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించేందుకు విధి,విధానాలు రూపొందిస్తున్నాంశేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమంగా స్మగ్లింగ్ చేస్తుంటే అవి కర్ణాటకలో దొరికాయి. వాటి విలువ 140 కోట్లు, ఆ డబ్బు అంతా కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళింది, మన వ్యవస్థలు సరిగ్గా పనిచేసి ఉంటే ఆ డబ్బుతో ఎంతోమంది విద్యార్థుల చదువుకు వినియోగించవచ్చు ప్రజలకు పారదర్శకంగా నూతన ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకొచ్చాం. PMAY ద్వారా జిల్లాల్లో అక్టోబర్ నాటికి 2,500 గృహాలు పూర్తి చేసేందుకు 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నాం. PMAY 2.O ద్వారా 2025 నుండి కేంద్రం ఇవ్వనున్న 2.5 లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 1.5 లక్షలు జోడించి 4 లక్షల వ్యయంతో పేదలకు గృహాల నిర్మాణం చేయనుంది.సూపర్ సిక్స్, షణ్ముఖ వ్యూహం అమలుతో రాష్ట్రం ముందుకు వెళుతుంది. దేశంలోనే ఆదర్శనీయమైన రీతిలో దివ్యాంగులు, వితంతువులు, వృద్దులకు ఏ ఆసరా లేని 28 కేటగిరీలకు చెందిన ప్రజలకు స్వాలంబనగా నిలుస్తూ పెన్షన్లు గణనీయంగా పెంచింది, ఒక్క కాకినాడ జిల్లాలో 2,77,594 మంది లబ్ధిదారులకు 134 కోట్ల పెన్షన్లు అందిస్తుంది ప్రభుత్వం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa