డబ్బుల కోసం ఓ వృద్ధురాలిని తన ఎదురింటి మహిళ హత్య చేసింది. అనంతరం వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుని పరారైంది. ఈ కేసును పోలీసులు నాలుగు రోజుల్లోనే ఛేదించారు. నిందితురాలను అరెస్టు చేసి 14.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ విలేకరులకు వెల్లడించారు. బాడంగి పోలీసు స్టేషన్ పరిధిలోని బాడంగి ముగడ కాలనీలో గెద్ద కృష్ణవేణి (62) అనే వృద్ధురాలు నివాసం ఉంటుంది. ఆమె భర్త నారాయణ ప్పలనాయుడు ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసి 2018లో మృతి చెందారు. అప్పటి నుంచి ఆ కాలనీలోనే కృష్ణవేణి ఒంటరిగా ఉంటుంది. వీరికి ఇద్దరు కుమా రులు. పెద్దకుమారుడు హరికృష్ణబాబు వృత్తిరీత్యా కుటుంబంతో విశాఖపట్నంలో, చిన్న కుమారుడు నాగేంద్రకుమార్ కుటుంబంతో పాలకొండలో నివాసం ఉంటున్నారు. కుమారులు అప్పుడప్పుడు తల్లి వద్దకు వచ్చి అవసరమైన మందులు కొనిచ్చి వెళ్లేవారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11న కృష్ణవేణి ఇంటి నుంచి గ్యాస్ వాసన వస్తుండడంతో స్థానికులు వెళ్లి తలుపులు తెరచి చూశారు. ఇంట్లో కృష్ణవేణి చనిపోయి ఉంది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకుపోయినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన తెంటు లక్ష్మి.. కృష్ణవేణి చిన్న కుమారుడు నాగేంద్రకుమార్కు ఫోన్ చేసి చెప్పింది. ఆయన ముగడ కాలనీకి చేరుకుని బాడంగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా కృష్ణవేణి ఇంటి ఎదురుగా గత కొంతకాలంగా నివాసం ఉంటున్న బొబ్బిలి మండలం పారాది గ్రామానికి చెందిన కలిశెట్టి లలితకుమారి అనే మహిళ 20 రోజుల కిందటే ఇంటిని ఖాళీ చేసి విశాఖపట్నం కంచెరపాలెంనకు వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు సాంకేతిక పరిజ్ఞానంతో సాక్ష్యాధారాలు సేకరిం చిన పోలీసులు డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీఐ నాగేశ్వరరావు, సీసీఎస్ సీఐ సత్యనారాయణ, సిబ్బంది బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఆమెను బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా నేరాన్ని అంగీకరించింది. తనకు డబ్బులు అవసరమై పక్కా ప్లాన్ ప్రకా రం ఈ నెల 11న కృష్ణవేణి ఇంటికి వచ్చినట్లు లలితకుమారి చెప్పింది. చున్నీతో కృష్ణవేణి గొంతు బిగించి హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుని పరారైనట్టు తెలిపింది. ఆమెను అరెస్టు చేసి 14.5 బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో క్రియాశీలకంగా వ్యవహ రించిన డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలు జయంతి, భాగ్యం, ఏఎస్ఐలు కొండలరావు, గౌరీశంకర్, హెచ్సీ సన్యాసిరావు, రామకృష్ణారావు, శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు హిమశంకర్, విశాలమ్మలను ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో ఎస్బీ సీఐలు విజయనాథ్, నర్సింహామూర్తి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa