:మీ కంటి చూపు ఎంతలా పెరుగుతుందంటే 7 రోజుల్లో మీ కళ్ళజోడు విసిరివేస్తారు.. ఈ మధ్య కాలంలో కంటికి సంబందించిన సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి.ఇంటి చిట్కాల ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చు.ఈ రోజుల్లో ఎక్కువగా టీవి చూడటం,ఫోన్ తో సమయాన్ని ఎక్కువగా గడపటం, కంప్యూటర్ ముందు ఎక్కువగా వర్క్ చేయటం వంటి అనేక రకాల కారణాలతో కంటికి సంబందించిన సమస్యలు ఎన్నో వస్తున్నాయి. కంటిలో శుక్లాలు, కళ్ల మంటలు,దురద వంటి సమస్యలను తగ్గించటానికి ఒక మంచి రెమిడీ తెలుసుకుందాం.ఈ రెమిడీ కోసం 50 గ్రాముల సొంపు, 50 గ్రాముల బాదం పప్పు,10 గ్రాములు తెల్ల మిరియాలు, 100 గ్రాముల పటికబెల్లం, నాలుగు యాలకులు తీసుకొని మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. రాత్రి పడుకొనే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో ఒక స్పూన్ పొడి కలిపి తాగాలి.
సొంపు కంటి చూపు పెంచటానికి, కంటి శుక్లాలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. తెల్ల మిరియాలు కూడా కంటికి సంబందించిన సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది. బాదం పప్పు కంటి చూపు రెట్టింపు మెరుగుదలకు సహాయపడుతుంది. పటికబెల్లం కూడా కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది.ఈ పొడిని రెగ్యులర్ గా వాడుతూ ఉంటే కంటికి సంబందించిన సమస్యలు తగ్గటమే కాకుండా జ్ఞాపకశక్తి సమస్యలు కూడా ఏమి లేకుండా చేస్తుంది. పిల్లలకు ఈ పొడిని పాలల్లో కలిపి ఇస్తే జ్ఞాపకశక్తి పెరగటమే కాకుండా కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa