వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు మార్చుకోవాలని, లేకపోతే సింగిల్ డిజిట్కే పరిమితమవుతారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. డ్రయాఫ్రం వాల్పై నివేదిక రాకముందే లేనిపోని అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇకనైనా జగన్ వైఖరి మారకుంటే.. సింగిల్ డిజిట్కే పరిమితమవుతారని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు.
పోలవరం డయాఫ్రం వాల్పై నివేదిక రాకముందే లేనిపోని అబద్ధాలు చెబుతున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ నేతలు అవే అబద్ధాలు చెప్పారని, పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించిన వైసీపీ నేతలకు ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి.. నిజమని నమ్మించాలన్న భ్రమలో వైసీపీ నేతలు ఉన్నారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa