అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన నవంబరు నెల కోటా టిక్కెట్లు సోమవారం విడుదలకానున్నాయి. ఆన్లైన్ ద్వారా ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానమ్ (టీటీడీ) విడుదల చేయనుంది. ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా ఈ టిక్కెట్లను కేటాయించనున్నారు. ఆగస్టు 19 ఉదయం 10 గంటల నుంచి 21 ఉదయం 10 గంటల దాకా ఆన్లైన్లో భక్తులు పేర్లు నమోదుచేసుకోవచ్చని టీటీడీ ప్రకటించింది. ఆగస్టు 21న లక్కీడిప్ నిర్వహిస్తామని, టికెట్లు దక్కించుకున్న భక్తులు 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
ఇక, ఊంజల్ సేవ, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఆగస్టు 22 ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని టీటీడీ వెల్లడించింది. వీటితో పాటు నవంబరు 9న శ్రీవారికి నిర్వహించే పుష్పయాగం సేవ టికెట్లను కూడా విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు కోటాను అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని పేర్కొంది.
అలాగే, అంగప్రదక్షిణకు సంబంధించి నవంబరు నెల కోటాను ఆగస్టు 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్లను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. దీంతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు.
నవంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆగస్టు 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్టు తెలిపిన టీటీడీ.. తిరుపతి, తిరుమలలో గదుల బుకింగ్ విండో అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని చెప్పింది. ఆగస్టు 27 ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ కోటా టికెట్లు.. ఉదయం 12 గంటలకు నవనీత సేవ టికెట్లు, మధ్యాహ్నం ఒంటి గంటకు పరకామణి సేవ టోకెన్లు ఆన్లైన్లో రిలీజ్ చేస్తామని టీటీడీ అధికారులు చెప్పారు. టీటీడీ అధికారిక వెబ్సైట్లోనే బుక్ చేసుకోవాలని, దళారుల చేతుల్లో మోసపోవద్దని భక్తులకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa