ఏపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లే చేశారు.. తనపై ఆరోపణలు చేసినవారికి నోటీసులు పంపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసులో.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆ ప్రచారం చేసిన పత్రికలు, మీడియా సంస్థలకు పరువు నష్టం నోటీసులు పంపించారు. పరువు నష్టం కింద రూ.100 కోట్లు చెల్లించాలని నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. ఒక్కో ఛానల్కు రూ.50కోట్ల చొప్పున పరువు నష్టం నోటీసులు పంపించారట తనపై నిరాధరంగా వార్తలు వేసి, వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారికి న్యాయ పరంగా ఎదుర్కొంటానని పెద్దిరెడ్డి చెప్పారు. ఇప్పుడు నోటీసులు పంపగా.. అతి త్వరలో ఆయన కేసు వేస్తారని ఆయన తరఫు లాయర్లు అంటున్నారు.
కొందరు తమపై పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. అటువంటి వారిపై చర్యలు తీసుకుంటానని ఇటీవల చెప్పారు.. తమపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కోర్టు ద్వారా పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు. అలాగే తనపై దాఖలైన అనర్హత పిటిషన్పై.. తనకు కోర్టు నుంచి ఇంకా ఎటువంటి నోటీసులు అందలేదన్నారు. అందితే కచ్చితంగా న్యాయపరంగా సమాధానం ఇస్తానన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలుసని.. చంద్రబాబు తప్పులను కొన్ని మీడియా సంస్థలు దాచేస్తున్నాయన్నారు. తమపై పని కట్టుకుని కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు నెలల్లో ఆరోగ్యశ్రీకి రూ.2500 కోట్లు ప్రభుత్వం బకాయి పడిందన్నారు పెద్దిరెడ్డి. ఆరోగ్యశ్రీని కూడా చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని.. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులను పీపీపీ పద్ధతిలోకి తీసుకొస్తామని చెప్పారన్నారు. రానున్న రోజుల్లో పేదలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఫీజు చెల్లించి వైద్యం తీసుకునే పరిస్థితి వస్తుందేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. పెద్దిరెడ్డి గతంలో చెప్పినట్లుగానే మీడియా సంస్థలకు తాజాగా పరువు నష్టం నోటీసులు పంపారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం, ఫైల్స్ దగ్థం ఘటనలో తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa