ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో వాగులో కొట్టుకుపోయి ఇటీవల మృతి చెందిన ఏకలవ్య గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు పరిహారం ప్రకటించారు. ఆ రెండు కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయని.. కేంద్రం నుంచి రూ.10 లక్షలు, రాష్ట్రం ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు కలిపి ఒక్కొక్కరికి మొత్తం రూ.15 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు.అలాగే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఇద్దరు ఉపాధ్యాయుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటుంందన్నారు మంత్రి. వాగులో కొట్టుకుపోయి మృతి చెందిన ఉపాధ్యాయులు మహేశ్, ఆర్తి హర్యానాకు చెందిన వారని.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వారి మృతదేహాలను స్వగ్రామానికి ప్రభుత్వమే తరలించినట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా నడిపే స్కూళ్లు, హాస్టల్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. దీనిపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏల పీవోలతో మాట్లాడామని.. అమాయక గిరిజనులను మభ్యపెట్టి నిబంధనలకు విరుద్ధంగా హాస్టల్స్ కొనసాగిస్తూ వాటిలో చిన్నారులను చేర్చుకోవడం చట్టవిరుద్ధమన్నారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి సంధ్యారాణి.
పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం సరాయివలస ఏకలవ్య పాఠశాల ఉంది. అక్కడ హర్యానకు చెందిన మహేశ్ హాస్టల్ వార్డెన్ కాగా.. ఆర్తి టీచర్గా పని చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 20న విధుల్లో చేరగా.. సాలూరులో అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గతవారం వర్షాలు కురుస్తుండగా.. వారు విధులకు హాజరయ్యారు. ఇద్దరు తిరిగి బైకుపై బయల్దేరగా.. మార్గం మధ్యలో రాయిమాను కొండవాగు ప్రవహిస్తోంది. ఇద్దరు వాగు దాటేందుకు ప్రయత్నించగా.. పట్టు తప్పి వాగులో పడిపోయారు. వార్డెన్ మహేశ్ వాగులో ఓ చెట్టు కొమ్మ సాయంతో ఒడ్డుకు వచ్చేందుకు ప్రయత్నించాడు.. కానీ అది విరిగిపోవడంతో ప్రవాహంలో కొట్టుకుపోయారు. స్థానికులు వాగులో గాలించి మహేశ్, ఆర్తిల మృతదేహాలను వెలికితీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa