అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా కంపెనీ దుర్ఘటన అత్యంత బాధాకరమని రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఈ ప్రమాదంలో 17మంది దుర్మరణం చెందడం తీవ్రంగా కలచివేస్తోందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం నుండి మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ప్రకటించడం జరిగిందన్నారు. క్షతగాత్రులను కూడా ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. గాయపడిన వారికి ప్రభుత్వం ఇప్పటికే మెరుగైన వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కంపెనీ యాజమాన్యంపై ఇప్పటికే ప్రభుత్వం చట్టపరమైన చర్యలు చేపట్టిందని మంత్రి బీసీ జానర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa