కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న నిరుపేదలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిత్యం అండగా నిలుస్తారని టీడీపీ యువ నేత గద్దె క్రాంతికుమార్ తెలిపారు. గుణదల 5వ డివిజన్ క్రీస్తురాజపురం వద్దగల టీడీపీ కార్యాలయంలో పలువురికి గద్దె క్రాంతికుమార్ శనివారం ఆర్థికసాయం చేశారు. క్రీస్తురాజపురంలో నివాసం ఉంటున్న గంగాధర్కు తమ ఇద్దరి పిల్లల ఫీజుల నిమిత్తం రూ.30 వేలు అందించడం జరిగిందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న మరో కార్యకర్త మోజె్సకు వైద్య ఖర్చులకు రూ.10వేలు ఇచ్చి ఆదుకున్నామన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధుల నుంచి ఈ ఆర్థికసాయం చేశారన్నారు. 8వ డివిజన్ గాయత్రి నగర్కు చెందిన చిగురాపాటి రాధాకృష్ణ కుమారికి ప్రమాదవశాత్తు చేయి విరగటంతో ఆమెకు వైద్యఖర్చులకు రూ.20వేలు ఆర్థికసాయం చేశారు. కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, జాస్తి లక్ష్మీపతి, కొత్తపల్లి రమేష్, రామారావు, నవీన్, మీసాల రాజు, దోమకొండ రవి, సిద్దెల వివేక్, రాచమళ్ల ఆంజనేయులు, షేక్ హాసిఫ్, దండమూడి సన్నిధి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa