రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేకుండా పోయిందని, ఇక ప్రజలకు రక్షణ ఎలా ఉంటుందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో నారా వారి రెడ్బుక్ రాజ్యాంగం కొనసాగుతోందన్న ఆయన, సీఎం చంద్రబాబు దారుణంగా ఆటవిక పాలన చేస్తున్నారని ఆక్షేపించారు. రాజకీయ కక్షతో పరిపాలన సాగుతోందని, యథేచ్ఛగా దాడులు, హత్యలు, ఆస్తుల విధ్వంసం జరుగుతున్నా.. ఏ మాత్రం పట్టించుకోని పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పూర్తిగా గౌరవం కోల్పోయిన పోలీసు వ్యవస్ధ వల్ల వారి ధైర్యం, స్ధైర్యం సమాధి అవుతున్నాయని, అందుకు మొత్తం బాధ్యత చంద్రబాబుదే అని మెరుగు నాగార్జున తేల్చి చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున బుధవారం మీడియాతో మాట్లాడుతూ..... రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటలు చూస్తే.. పోలీసు వ్యవస్ధను ప్రభుత్వం ఎంతలా దిగజార్చిందో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందన్న ఆయన, చిలకలూరిపేట ఎమ్మెల్యే భార్య పుట్టిన రోజు సందర్భంగా సీఐలతో సహా పోలీసు సిబ్బంది అంతా వెళ్లి కేక్ కట్ కటింగ్లో పాల్గొన్న విషయాన్ని ఉదహరించారు. తాడిపత్రిలో నిజాన్ని నిర్భయంగా చెప్పిన ఓ సీఐతో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి.. వీడియో కాల్లో క్షమాపణ చెప్పించారని, బాపట్ల జిల్లా భట్టిప్రోలులో ఓ టీడీపీ కార్యకర్త ఎస్ఐ చొక్కా పట్టుకున్నా.. అలాంటిదేం జరగలేదని ఏకంగా సీఎం చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు అని అభివర్ణించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్ధ అత్యంత దారుణంగా నీరుగారి పోయిందనడానికి ఇవన్నీ నిదర్శనాలని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa