విశాఖపట్టణంలో భారీ సంఖ్యలో కార్పొరేటర్లు వైసీపీకి గుడ్బై చెప్పి.. టీడీపీ, జనసేనలో చేరిపోయారు. తాజాగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీ 40 మందికి పైగా కార్పొరేటర్లతో పటిష్టంగా ఉన్నా మేయర్ కొందరు కార్పొరేటర్లతో కలిసి టీడీపీ గూటికి చేరారు. త్వరలో మరికొంతమంది టీడీపీ, జనసేనలో చేరనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా జగన్కు నమ్మినబంటుగా ఉండే రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ సైతం వైసీపీకి రాజీనామా ప్రకటించారు. త్వరలోనే ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత సైతం జగన్కు గుడ్బై చెప్పారు. పార్టీలో ఇన్ని పరిణామాలు జరుగుతున్నా జగన్ మాత్రం నోరు విప్పడంలేదు. వలసలపై వైసీపీ హైకమాండ్ అసలు స్పందించడం లేదు. టీడీపీ, జనసేన గ్రీన్ సిగ్నల్ ఇస్తే చేరేందుకు వందల సంఖ్యలో వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. రానున్న రోజుల్లో మరింతమంది సీనియర్ నేతలు వైసీపీని వీడనున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa