మూగజీవాల పట్ల దుండుగులు అంత్యంత దారుణంగా వ్యవహరించారు. ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న నదిలోకి 50కిపైగా ఆవులను తోసేశారు. దీంతో 20 వరకూ గోవులు ప్రాణాలు కోల్పోయాయి. మానవత్వం మంటగలిసిన ఈ ఘటన మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లా నాగోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగులోకిరాగా.. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. కానీ, ఇంకా దీనిని నిర్దారించలేదని వెల్లడించారు.
‘‘బామోర్ సమీపంలోని రైల్వే బ్రిడ్జ్ కింద సత్నా నదిలో కొందరు వ్యక్తులు ఆవులను విసిరేస్తోన్న వీడియో మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది.. ఈ వీడియోను తీవ్రంగా పరిగణించి.. ఘటనా స్థలికి ఓ పోలీస్ బృందాన్ని పంపి సమాచారం సేకరించాం.. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టాం’’ అని నగోడ్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జి అశోక్ పాండే తెలిపారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులపై కేసు నమోదుచేశామని వారిని. బేటా బాగ్రీ, రవి బాగ్రీ, రాంపాల్ చౌధురి, రాజ్లూ చౌధురిగా గుర్తించామని పేర్కొన్నారు. వీరిపై మధ్యప్రదేశ్ గోవధ నిషేధ చట్టం, బీఎన్ఎస్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదయినట్టు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
‘ప్రాథమిక దర్యాప్తు ప్రకారం 50 ఆవులను నదిలోకి తోసేయగా.. 15 నుంచి 20 వరకు చనిపోయాయి.. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.. అయితే, ఎన్ని ఆవులను తోసేశారనేది ఖచ్చితంగా తెలియరాలేదi.. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయి’ అని పాండే వివరించారు. నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని చెప్పారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఎందుకు ఇంత కిరాతకంగా వ్యవహరించారు అనేది తెలియాల్సి ఉంది. దీని వెనుక ఎవరు ఉన్నారు? ఏదైనా కుట్ర ఉండా? పోలీసులకు పట్టుబడకుండా గోవులను కబేళాకు తరలిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa