కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ (హిడెన్) కెమెరాలో వ్యవహారం కలకలంరేపింది. గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినులు అర్ధరాత్రి ఆందోనళకు దిగారు.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. వాష్రూమ్లలో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేసి విద్యార్థినిల వీడియోలను రికార్డు చేస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై ఇదంతా చేస్తున్నాడని.. ఆ వీడియోలను అమ్ముతున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. అక్కడితో ఆగకుండా అందరూ కలిసి అతడిపై దాడికి ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.. విద్యార్థినలకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.
ఈ హిడెన్ కెమెరాల వీడియోల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైనల్ ఇయర్ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ విద్యార్థి ల్యాప్ ట్యాప్, మొబైల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఫైనలియర్ విద్యార్థికి.. మరో విద్యార్థిని సహకరిస్తూ వాష్రూమ్లలో కెమెరాలు ఏర్పాటు చేసినట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఇలా శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల వరకూ ఇంజినీరింగ్ కాలేజీలో హైడ్రామా నడిచింది.
ఈ హిడెన్ కెమెరాల విషయాన్ని కొందరు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. గత వారం రోజులుగా కాలేజీలో ఇదంతా జరుగుతోందని.. మేనేజ్మెంట్ చర్యలు ఎందుకు తీసుకోలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితమే ఈ విషయం బయటపడినా.. కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడం దారుణమంటున్నారు. పోలీసులు ఈ హిడెన్ కెమెరాల వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ప్రశ్నించి, వివరాలు సేకరిస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇంజినీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్లో హిడెన్ కెమెరాలు.. విద్యార్థినిల ఆందోళన
మరోవైపు నూజివీడు ట్రిపుల్ ఐటీలో తమ కష్టాలు తీరడం లేదంటున్నారు విద్యార్థులు. తాము వాంతులు , విరేచనాలు, కడుపునొప్పి, జ్వరంతోపాటు కళ్లు తిరిగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం కూడా 194 మంది వరకు అస్వస్థతకు గురై ఆసుపత్రికి వచ్చారు. స్వయంగా మంత్రి పార్థసారథి ట్రిపుల్ఐటీలో పర్యటించి మెస్ పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేసినా అక్కడ ఏ మాత్రం మార్పు రాలేదంటున్నారు. మళ్లీ గురువారం ఉదయం కూడా టిఫిన్లో పాడైన గుడ్లు, రుచి లేని ఉప్మా వడ్డించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మధ్యాహ్నం భోజనంలో కూడా మాడిపోయిన బెండకాయ కూర, నీళ్ల పెరుగు వడ్డించారని చెబుతున్నారు. అలాగే అన్నంలో పురుగులు కనిపించాయంటున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారకు. స్వయంగా మంత్రి పరిశీలించి ఆదేశాలు ఇచ్చినా అక్కడి సిబ్బంది తీరు మాత్రం మారడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa