ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రమాదవశాత్తు పెయింటర్‌ మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 03, 2024, 07:49 PM

కళ్యాణదుర్గం పట్టణంలో పెయింటర్‌ వినోద్‌ (32) భవనంపై నుంచి పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానికంగా ఉన్న నారాయణప్ప, అరుణమ్మ దంపతుల కుమారుడు దాసరి వినోద్‌ పెయింటర్‌గా జీవనం సాగించేవాడు. కాగా సోమవారం స్టేట్‌ బ్యాంక్‌ వెనకాల భవనం మూడో అంతస్తులో పెయింటింగ్‌ పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాఫ్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa