అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షు డు గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నా రు. వారు సోమవారం మండలంలోని ఆర్ అనంతపురంలో బ్లాక్ ప్లాం టేషన కింద చేపట్టిన మొక్కలు నాటే కార్యక్ర మంలో పాల్గొన్నారు. అనంతరం బుళ్ళస ముద్రం గ్రామంలో జనసేన నాయకు లు ఏర్పాటుచేసిన ఉపముఖ్యమంత్రి పవన కళ్యాణ్ జన్మదిన రోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ... నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా అర్ అనంతపురం వద్ద ఎలక్ట్రానిక్ పరిశ్రమల కోసం 1650 ఎకరాల భూములు సేకరించామని తెలిపారు. అలాగే మడకశిరకు బైపాస్ కెనాల్, రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతించారన్నారు. మడకశిర మండలానికి అతి పెద్డ సోలార్ ప్రాజెక్ట్ రానుందని, అందుకోసం 6300 ఎకరాల భూముల సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. రైతులందరూ సహకరించా లని కోరారు. అర్హులైన వారికి పింఛన్లు, ఇళ్లు మంజూరుచేస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa