EPS పింఛన్దారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇకపై పెన్షనర్లు దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా, ఏ బ్యాంక్ నుంచైనా పెన్షన్ మొత్తాన్ని తీసుకునేందుకు కేంద్రం వీలు కల్పించినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ మేరకు సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ తీసుకొచ్చేందుకు ఈపీఎఫ్ ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. అయితే ఈ సదుపాయం 2025 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa