విజయవాడలోని వరద బాధితుల సహాయార్థం దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్సాగర్ దంపతులు బుధవారం సాయంత్రం సీఎం చంద్రబాబుకు రూ.47.16200 లక్షల చెక్కును అందజేశారు. నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, దాతలు అందించిన విరాళం రూ.37,16200 లక్షలు, డాక్టర్ లక్ష్మి దంపతులు రూ.10 లక్షలు కలిపి సీఎంకు అందించారు. ఈ సందర్భంగా తుఫాన్ బాధితుల కోసం భారీగా విరాళాలు సేకరించినందుకు సీఎం చంద్రబాబు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, తాళ్లూరు ఎంపీపీ శ్రీనివాసరావు, దర్శి నగర పంచాయతీ చైర్మన్ పిచ్చియ్య, ముండ్లమూరు, దొనకొండ, తాళ్లూరు, కురిచేడు మండలాల పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు, నాగులపాటి శివకోటేశ్వరరావు, ఓబుల్రెడ్డి, నెమలయ్య పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa