ప్రతి మహిళ ఇంటి వద్ద పెరటి తోటలు పెంచుకోవాలని ప్రకృతి వ్యవసాయ అడిషనల్ కడప జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వసంతకుమారి సలహా ఇచ్చారు. బుధవారం పెండ్లిమర్రి మండల సమాఖ్యలో ప్రకృతి వ్యవసాయంపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వసంతకుమారి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకర పంటలు, వాతావరణం నెలకొని ఉం టుందన్నారు. ఇప్పటికే రసాయన ఎరువుల కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. నేల స్వభావం కోల్పోతోందన్నారు. దీన్ని అరికట్టాలంటే ప్రకృతి వ్యవసాయం చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం వెంకటేశ్వరరావు, సందీప్, సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa