వినాయక చవితి పర్వదినం సందర్భంగా గత ఐదు రోజులుగా పూజలందుకున్న వినాయకుడి విగ్రహాలను నిమజ్జనానికి గంగమ్మ ఒడికి తరలించారు. గణనాధుడి విగ్రహాలను ట్రాక్టర్లలో, లారీలలో ఉంచి డప్పులు, టపాకాయలు, డీజే సౌండ్ సిస్టమ్స్తో నృత్యాలు చేసూ రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా నిమజ్జనం నిర్వహించారు. దేవునికడప చెరువు, , ఆలంఖానపల్లె వద్ద గల కేసీ కాల్వనీటిలో నిమజ్జనం చేశారు. ‘గణపతి బప్పా మోరియా’ అంటూ భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా కోలాటం, చెక్కభజనతో పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తు లు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ట్రా ఫిక్ అంతరాయం ఏర్పడింది. రాజీవ్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి భారీ విగ్రహంతో పాటు కడప బాలాజీనగర్లోని తారకరామనగర్లో, 44 వ డివిజన టీడీపీ ఇనచార్జ్ ఖాజాపీర్ పాల్గొన్నారు. యర్రముక్కపల్లె నుంచి భారీ వినాయకుడి విగ్రహం ఊరేగింపుగా, దేవునికడప చెరువు, ఆలంఖానపల్లె వద్గ గల కేసీ కెనాల్లో నిమజ్జనం గావించారు. కడప నగరం 49వ డివిజన ఆలంఖానపల్లె కాలనీలో రాణితోట వీధి, మసీదు వెనుక గత ఐదు రోజులుగా ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాలకు ని ర్వాహకులు పూజలు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa