ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో వాలంటీర్‌ వ్యవస్థను రద్దు చేయాలి.. వైవీబీ రాజేంద్ర ప్రసాద్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 14, 2024, 07:28 PM

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా? లేదా?.. కొద్దిరోజులుగా ఇదే సస్పెన్స్ కొనసాగుతోంది. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని ప్రభుత్వం పదే, పదే చెబుతున్నా.. ఆ దిశగా అడుగులు వేయలేదు. వాలంటీర్ల సేవల్ని ఎలా ఉపయోగించుకోవాలో కసరత్తు చేసి ఓ నిర్ణయం తీసుకుంటామని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అయితే ఈలోపు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ టీడీపీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.


రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని రద్దు చేయాలని, సచివాలయ వ్యవస్థను గ్రామ పంచాయతీరాజ్‌ శాఖలో విలీనం చేయాలని పంచాయతీరాజ్‌ చాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్‌ డిమాండ్ చేశారు. వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలకు ఇవ్వాలని కోరారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సర్పంచులతో చర్చించకుండా పంచాయతీ నిధులను దారి మళ్లించారన్నారు. ఈ కారణంగానే అభివృద్ధి ఆగిందని.. అందుకే కృతనిశ్చయంతో పనిచేసి జగన్‌ను ఓడించామన్నారు. ఏ ప్రయోజనాల కోసమైతే జగన్‌ను ఓడించామో.. వాటిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం నుంచి ఆశిన్తున్నామన్నారు.


కొత్త ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే పంచాయతీలకు రూ.12.48 కోట్లను జమ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. వరద బాధితుల సహాయార్ధం రూ.68 కోట్లు అందజేసినందుకు.. వరద ప్రభావిత 400 పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి రూ.లక్షచొప్పున ప్రకటించినందుకు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. తాము కూడా వరద బాధితుల సహాయార్థం ఒకరోజు వేతనం రూ.7 కోట్ల చెక్‌ను పవన్‌ కళ్యాణ్‌కు అందజేశామన్నారు. అలాగే గ్రామ సచివాలయాలను పంచాయతీల్లో విలీనం చేసి.. సచివాలయాల్లో పనిచేసే కార్యదర్శుల్ని సర్పంచ్ ఆధ్వర్యంలో పనిచేసేలా చేయాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa