పాకిస్థాన్లోని బలూచిస్థాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు లోయలో పడిపోవడంతో ఆరుగురు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం దనసర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బస్సు పర్వత మార్గం గుండా వెళుతుండగా అకస్మాత్తుగా లోతైన లోయలో పడిపోయింది. ఆ సమయంలో బస్సులో మొత్తం 30 మందికి పైగా ఉన్నారు. వారిలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa