పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ అయిందనే భక్తుల్లో ఆందోళన, ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. తిరుమల లడ్డూ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.కల్తీ నెయ్యి ఘటన ఎంతో బాధ కలిగించిందని, ఇలాంటి ఘటనలతో ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు రాహుల్. దీనిపై లోతైన విచారణ జరపాలన్నారు. ఇదే విషయంపై ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. అన్యమతస్తులకు TTD పగ్గాలు ఇవ్వడం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు బండి. CBIతో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు నిగ్గు తేలుతాయన్నారు.
కేంద్ర మంత్రులు ప్రల్హాద్ జోషి, గిరిరాజ్ సింగ్ కూడా ఈ మేటర్పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు చాలా తీవ్రమైనవని, ఆ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలని, దోషులను కఠినంగా శిక్షించాలన్నారు ప్రల్హాద్ జోషి. మన మధ్య హిందూ వ్యతిరేకులు ఉన్నారు, మమ్మల్ని క్షమించు వెంకటేశ్వర అంటూ కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ట్వీట్ చేశారు. ఈ విషయంలో ల్యాబ్ రిపోర్ట్ పంపించాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా. ఆ నివేదికపై సమగ్ర పరిశీలన జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు ఆయన.
ఇదే మేటర్పై సుప్రీంకోర్టు సీజేఐకి లేఖ రాశారు జర్నలిస్ట్ సురేష్ చౌహాన్కే. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని, ఆలయాల పవిత్రత, మత విశ్వాసాలు, సంప్రదాయాలపై అవగాహన ఉన్నవారికే దేవాలయాల నిర్వహణ అప్పగించాలని ఆ లేఖలో కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa