ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమస్యలని నా దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 26, 2024, 07:31 PM

ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కోరారు. బుధవారం కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రి అభివృద్ధికమిటీ సమావేశం సూపరింటెండెంట్‌ శోభరాణి ఆధ్వర్యంలో జరిగింది. ఈసందర్భంగా జగదీశ్వరి ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది వివరాలు, ఖర్చు చేసిన నిధులు, మందులు నిల్వలు, రోగులకు అందజేస్తున్న భోజనం నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ సమస్యలు తన దృష్టికి తీసుకు వస్తే పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఆసుపత్రిలో సక్ర మంగా పనిచేయని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్ర మంలో కమిటీ సభ్యులు ఆకుల రమేష్‌, బోటు గౌరిశంకర రావు, మీసాల భార తి, ఈవోపీఆర్డీ ఆర్‌.రమేష్‌ బాబు, టీడీపీ మండల కన్వీనర్‌ కేవీ కొండయ్య, మాజీ ఎంపీపీ రమణమూర్తి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa