తీవ్ర తుఫాను ‘దానా’ వాయువ్య, ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో గడిచిన 6 గంటల్లో.. గంటకు 12 కిమీ వేగంతో వాయువ్య దిశగా కదులుతూ.. ఈరోజు, అక్టోబర్ 24, ఉదయం 08.30 గంటలకు వాయువ్య బంగాళాఖాతంలో 18.9° ఉత్తర అక్షాంశం, 88.0° తూర్పు రేఖాంశం, దాదాపు పారాదీప్(ఒడిశా)కి ఆగ్నేయంగా 210 కిలోమీటర్ల దూరంలో, ధమరకి(ఒడిశా) దక్షిణ-ఆగ్నేయంగా 240 కిలోమీటర్ల దూరంలో, సాగర్ ద్వీపానికి(పశ్చిమ బెంగాల్) దక్షిణాన 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నది.ఈ తీవ్ర తుఫాన్ ఉత్తర-వాయువ్య దిశగా కదిలి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మధ్య ఉన్న పూరీ, సాగర్ ద్వీపం మధ్య భితార్కనికా, ధమర(ఒడిశా) దగ్గరగా 24 అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 25, 2024 ఉదయం మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశముంది. తీరం దాటే సమయంలో బలమైన ఈదురు గాలులు గంటకు 100-110 కిలోమీటర్లు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర దిశగా గాలులు వీస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa