పుణె: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా కష్టాల్లో పడింది. 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. మూడో రోజు టీ విరామ సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.రవీంద్ర జడేజా (4), అశ్విన్ (9) క్రీజులో ఉన్నారు. 81/1తో రెండో సెషన్ను ఆరంభించిన భారత జట్టు.. ఈ సెషన్లో 97 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్ అనంతరం భారత్ వరుసగా శుభ్మన్ గిల్ (23), యశస్వి జైస్వాల్ (77), రిషభ్ పంత్ (0), విరాట్ కోహ్లీ (17), సర్ఫరాజ్ ఖాన్ (9), వాషింగ్టన్ సుందర్ (21) వికెట్లను చేజార్చుకుంది.భారత్ విజయానికి ఇంకా 181 పరుగులు అవసరం. న్యూజిలాండ్ బౌలర్లలో శాంట్నర్ 5, గ్లెన్ ఫిలిప్స్ ఒక వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 259, భారత్ 156 పరుగులు.. రెండో ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 255 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa